ఓంశేఖర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణవాసి, చేనేత కార్మికుడు ఓంశేఖర్‌ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న దేవాంగ సంక్షేమ సంఘం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మే 14వ తేదీ రాష్ట్ర, జిల్లా, పట్టణ దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు దాశెట్టి నారాయణస్వామి, దేవి ప్రకాష్‌, వట్టి రామాంజనేయులు, ముక్తాపురం అజయ్‌ కుమార్‌, చింతగింజల వెంకటనారాయణ, గువ్వల శ్రీనివాసులు, ముక్తాపురం నాగభూషణం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి రూ. 25,116 అందజేశారు. ఓంశేఖర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతామని వారు పేర్కొన్నారు. Хτrаdеgrοk 8.1 Flех

Follow us on social media

Related posts

Leave a Comment