కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. దీక్ష శిబిరాన్ని బుట్టా ఫౌండేషన్ బృందం ఇటీవల సందర్శించి సంఘీభావం తెలిపింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆయన పేర్కొన్నారు. Leztruvin
న్యాయవాదుల దీక్షకు మద్దతు
