తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అదిలాబాద్ జిల్లా పద్మశాలీ సంఘం నాయకులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గౌరవ జోగు ప్రేమేందర్, ఆదిలాబాద్ జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, రాష్ట్ర కార్యదర్శి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, గౌరవ అధ్యక్షులు మోర ఆశన్న, ఉపాధ్యక్షులు బొమ్మకంటి రమేష్, నాయకులు గాజుల హన్మండ్లు, పెంట వెంకన్న, గాజంగుల రాము, దాసరి ఆశన్న, పద్మశాలీ కులస్థులు పాల్గొన్నారు. Immediate Edge


