ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా నవంబర్ 7వ తేదీ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్పర్సన్, అడ్వకేట్ జింకా విజయలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి ప్రొద్దుటూరులో అమ్మవారిశాల నుంచి శివాలయం సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. Xtradegrok 8.1 Flex


