కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో ఆరో రోజు (సెప్టెంబర్ 27వ తేదీ) అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

చండీ హోమంలో..
నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. ఆరో రోజు (27వ తేదీ) పొబ్బతి శ్యామ్సుందర్ ( స్టార్ హెల్త్ ఇన్ష్యూరెన్స్) – ప్రసన్నలక్ష్మి దంపతులు, సీటీవో (రిటైర్డ్) మేడిపల్లి సుధాకర్ – వాసవి దంపతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెంచర్ల లక్ష్మీనారాయణ – హేమలత దంపతులు హోమంలో పాల్గొన్నారు.




ఐదో రోజు హోమంలో పాల్లొన్న వారి వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి..



