పారిశుధ్య కార్మికులకు కోడిగుడ్ల పంపిణీ

బుట్టా ఫౌండేషన్‌ అధ్వర్యంలో కర్నూలులోని కేవీఆర్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ విజయ భారతి రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే 15వ తేదీ కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కర్నూలు నగరం సి.క్యాంపు సెంటర్‌, గణేష్‌ నగర్‌, సోమిశెట్టి నగర్‌, శ్రీరామ్‌ నగర్‌, మద్దూర్‌ నగర్‌, గాయత్రి ఎస్టేట్‌, బిర్ల గడ్డా ప్రాంతాల్లో పనిచేస్తున్న 100 మంది పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 10 గుడ్ల చొప్పున అందజేశారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండడం కోసం బుట్టా ఫౌండేషన్‌ కోడిగుడ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ , ప్రతినిధులు చెన్నప్ప, మోహన్‌ కృష్ణ పాల్గొన్నారు. Ampla Tesouròs

Follow us on social media

Related posts

Leave a Comment