ఏపీలో సదరం క్యాంపులు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. మూడు మాసాలకు (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) ఒకేసారి స్లాట్స్ విడుదల చేస్తున్నారు. ఇవి గురువారం నుంచి ఓపెన్ అవుతాయి. బుద్ధిమాంద్యం, చెవుడు, మూగ, అంగ వైకల్యంతో బాధపడుతున్న వారు మీసేవ, గ్రామ, వార్డు సచివాలలో స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న తేదీన సదరం క్యాంపునకు హాజరుకావాల్సి ఉంటుంది. వైద్యులు పరీక్షలు నిర్వహించి వైకల్య శాతాన్ని నిర్ధారిస్తారు. వారిచ్చి సర్టిఫికేట్ ఆధారంగా వైకల్య పింఛన్ పొందవచ్చు. Avex Pro 2.0
నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్..
