జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ నిలురి రుషింగప్ప ధర్మవరం జోగోనికుంటలోని చేనేత కార్మికుడు దాసరి రామాంజినేయులు కుటుంబానికి నగదు అందజేశారు. చేనేత వర్గాలు, దాతల సహకారంతో రూ. 13,200లను మృతుడి భార్య చౌడమ్మకు జూలై 29వ తేదీ అందజేశారు. లాక్డౌన్ కారణంగా రామాంజినేయులకు ఆర్థిక ఇబ్బందులు తల్తెతాయి. కుటుంబాన్ని ఎలా పోషించాలన్న ఆందోళనతో గుండెపోటుకు గురై గత వారం మృతిచెందారు. రామాంజనేయులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు సంతానం. కార్యక్రమంలో చెలిమి శివరాం, పడిగేరి నాగరాజు నాగ భూషణం, ప్రభాకర చౌడయ్య పాల్గొన్నారు. アクシス フラクスラド

