మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 6వ తేదీ కర్నూలు 23వ వార్డులో మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కటారి పల్లవిని గెలిపించాలని ఓటర్లును అభ్యర్థించారు. పల్లవి కుటుంబసభ్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులందరికి సంక్షేమ పథకాలు వర్తించేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. మాజీ ఎంపీ వెంట ప్రచారంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు మద్దయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Tyvixom

