శ్రీ దత్తసాయి సేవకులు, సాయి పూజా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్, డాబా గార్డెన్స్ ఎల్ఐసీ సర్కిల్, ద్వారకానగర్, సీతమ్మ పేట, సూర్యాబాగ్, జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, స్ప్రింగ్ రోడ్ ప్రాంతాల్లోని నిరుపేదలకు బుధవారం 300 మందికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ వానపల్లి రవికుమార్, దత్త సాయి సేవకులు బుజ్జి, సత్యనారాయణ, మోహన్, కోటి, గోపి, విజయ్, కృష్ణమూర్తి (ప్రహ్లాదపురం), వార్డు కార్యదర్శి సారిపల్లి మహేష్, అప్పలరాజు, శ్రీనివాసరావు, తిరుపతి రావు, వెంకట శర్మ, రాజు, అర్జీ శంకర్, శివోహం ట్రస్ట్ సహాయ కార్యదర్శి ఎస్. మురళి పాల్గొన్నారు. Liman Dexeris

