
లాక్డౌన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో పద్మశాలీ చేనేత కార్మికులకు భోజనం వడ్డిస్తున్నారు. మాస్టర్ వీవర్ కార్యంపూడి కోటీనాగులు, సాఫ్ట్ వేర్ రంగంలో అమెరికాలో స్థిరపడ్డ కార్యంపూడి శ్రీనివాస వర ప్రసాద్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం గ్రామంలో గత 10 రోజుల నుంచి కొనసాగుతోంది. రోజు మధ్యాహ్నం అన్నం, పప్పు లేదా కర్రీ వండి పెరుగుతో పాటు ఆహార పొట్లాలు తయారు చేస్తారు. వీటిని పద్మశాలీ యూత్ సహకారంతో రోజు మధ్యాహ్నం సుమారు 150 మంది చేనేత కార్మికులు, పేదలకు అందజేస్తారు.

చేనేత కుల సంఘాల కార్యవర్గ ,సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాల వివరాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి
