ఏపీ పద్మశాలీ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలను సందర్శించారు. మహిశాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు అమ్మవారిశాల కమిటీ సభ్యులు బుశెట్టి రామ్మోహన్, జొన్నలగడ్డ రవి చైర్పర్సన్కు ఘన స్వాగతం పలికారు.
శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘాల నాయకులు

చైర్పర్సన్ జింకా విజయలక్ష్మిని ప్రొద్దుటూరులోని బీసీ సంఘం నాయకులు కలిశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రొద్దుటూరులోని రజక సంఘం నాయకులు, 40వ వార్డు ఇన్చార్జి నాగేంద్ర తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు ఉప్పర మురళి (ఆంధప్రదేశ్ రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్), శేఖర్ రెడ్డి, సుబ్బరాయుడు యు.ఎస్ మహబూబ్ బాషా పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika

