హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు జీని రాం మూర్తి గారు ఈ రోజు (21.11.22) ఉదయం కన్నుమూశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు పద్మశాలీ ప్రముఖులు ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాలు గుర్తు చేసుకున్నారు. వివిధ హోదాల్లో పద్మశాలీయుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
జీని రాం మూర్తి గారితో మీకున్న అనుబంధాన్ని క్లుప్తంగా తెలుపుతూ ఆయనతో దిగిన ఫొటోను మాకు (8333871117) షేర్ చేయండి. సందర్భాన్ని కూడా రాసి పంపండి. చేనేతమిత్ర వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. Which Canadian casino pays out the most?


