కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో ఏడో రోజు (సెప్టెంబర్ 28వ తేదీ) అమ్మవారు మహా చండీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.



చండీ హోమంలో..
నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. ఏడో రోజు (28వ తేదీ) కర్ణాటక బ్యాంకు ఆఫీసర్ తనికంటి కృష్ణ మోహన్-లలిత దంపతులు, అంజనాద్రి బిల్డర్స్ నారాయణ నాగేశ్వరరావు-పవిత్ర దంపతులు, బాదున శ్రీనివాసులు-పద్మావతి (చందన ప్లాస్టిక్ట్స్) దంపతులు హోమంలో పాల్గొన్నారు.

ఆరో రోజు హోమంలో పాల్లొన్న వారి వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి..




