మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అయ్యప్ప కొండపై నిర్మిస్తోన్న శివమార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు సహకరిస్తున్నారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన జన్ను సత్యనారాయణ రూ. 50,116/ చెక్కును తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వొగ్గు బాలరాజుకు అందజేశారు. జన్ను సత్యనారాయణ హైదరాబాదులో ఆయిల్ ఫెడ్ మేనేజరుగా పనిచేస్తున్నారు. విరాళం ఇచ్చిన సత్యనారాయణకు బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.

