భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు

కర్నూలు పాతబస్తీ పరిధిలోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయం, అలాగే కుమ్మరివీధిలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను అక్టోబర్‌ 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రోజు ఉదయం 7.30 నుంచి 11.00 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవచ్చని ఆలయ కమిటీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఆలయంలో భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసింది.

మీ ప్రాంతంలోని ఆలయాల్లో జరిగే దసరా ఉత్సవాల వివరాలను మాకు పంపండి. రోజు జరిగే పూజ కార్యక్రమాలు, ఫొటోలు, పాల్గొన్న వారి పేర్లు తదితర వివరాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. వాటిని వెబ్‌సైట్‌ www.chenetamitra.com లో వీక్షించండి. Bitnex Crestfort

Follow us on social media

Related posts

Leave a Comment