వికేంద్రీకరణతోనే అభివృద్ధి ఫలాలు : మాజీ ఎంపీ బుట్టా రేణుకా

పరిపాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపాదనను మద్దతు తెలుపుతున్నానన్నారు. అమరావతిలో లెజిస్లేచర్‌ రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడిషియల్‌ రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ముఖ్య మంత్రి గౌరవించి అన్ని ప్రాంతల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. Fundex Bitport

Follow us on social media

Related posts

Leave a Comment