టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..

చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా – చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లను తయారు చేసి…

‘విద్యార్థుల యూనిఫాంలను టెస్కో ద్వారా మాత్రమే కొనాలి’

శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఏఐడబ్ల్యూఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు

చేనేతమిత్ర, హైదరాబాద్: గురుకులల్లో విద్యార్థులకు యిచ్చే ఉచిత యూనిఫాంలను టెస్కో(తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ (A.I.W.F) తెలంగాణ రాష్ట్ర నాయకులు చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యర్‌కు వినతిపత్రం అందజేశారు. చేనేత దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవాళ్లను టెస్కోద్వారా కాకుండా టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయాన్ని సమాఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చేనేత కార్మికుల ఇబ్బందులను శైలజ రామయ్యర్‌కు వివరించారు. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. మహాత్మ జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTGBCWREIS) కార్యదర్శి సైదులును కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి…