చేనేతమిత్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలో జరగనుంది. మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని విభాగాల నూతన కార్యవర్గ సభ్యులు 26 జిల్లాల నుంచి హాజరుకానున్నట్లు రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు తెలిపారు. అఖిల భారత పద్మశాలీ (ABPS) సంఘానికి అనుబంధంగా ఈ కమిటీ పనిచేయనుంది. ‘కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని మనవి..’ ‘‘అఖిల భారత పద్మశాలీ సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశాం. నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరుగుతుంది. యువజన విభాగం, మహిళా విభాగం, చేనేత విభాగాల కార్యవర్గ సభ్యులు…